విచారణకు రెడీ.. ట్యాపింగ్​ కేసుపై కుమారస్వామి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:53 IST)
కొద్ది రోజులుగా కర్నాటకను కుదిపేస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో బీజేపీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకునపెట్టేలా ట్యాపింగ్​ కేసుల దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారమే సీబీఐకి లెటర్​ రాస్తానని చెప్పారు. 
 
కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో పొలికల్​ క్రైసిస్​ తలెత్తిన సందర్భంలో నాటి సీఎం కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన కీలక నేతలు, ఇంకొందరు అధికారుల ఫోన్లు ట్యాప్​ చేయించారనే ఆరోపణలొచ్చాయి. అక్రమంగా ఫోన్లు ట్యాప్​ చేసి, రాజీనామాలు వెనక్కి తీసుకోకుంటే ఆడియో క్లిప్స్​ బయటపెడతానని కుమారస్వామి బెదిరించినట్లు రెబల్​ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏహెచ్​ విశ్వనాథ్​(జేడీఎస్​) ఆరోపించారు. 
 
బెంగళూరు సిటీ పోలీస్​ కమిషనర్​ ఓ అధికారితో మాట్లాడిన ఆడియో క్లిప్​ కూడా సంచలనం రేపింది. ఫోన్​ ట్యాపింగ్స్​పై సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్​ పార్టీ స్వాగతించింది. అయితే గతంలోలా సీబీఐని బీజేపీ తన సొంతానికి వాడుకోవద్దని, వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని బీజేపీలోకి చేర్చుకున్న 'ఆపరేషన్​ కమల్'పైనా విచారణ చేయించాలని కాంగ్రెస్​ లీడర్​ సిద్దరామయ్య కోరారు. 
 
కాగా, ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కొన్ని లోకల్​ టీవీ చానెల్స్​ పనిగట్టుకుని ప్రాపగండా చేశాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. 'సీబీఐతో కాకుంటే ఇంటర్నేషనల్​ ఏజెన్సీతోనైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఫిర్యాదుచేసి, ఆయన తరఫున ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా ఫర్వాలేదు' అని కుమారస్వామి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments