ఆస్పత్రికి వెళితే.. వార్డు బాయ్ అలా తడిమాడు.. ముంబైలో దారుణం

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (15:12 IST)
మహిళలకు భద్రత కరువైంది. ఎక్కడపడితే అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. ఆస్పత్రితో పనిచేసే ఓ వార్డు బాయ్ మహిళ పట్ల రెచ్చిపోయాడు. మందు రాస్తానని చెప్పి మహిళ లైంగికంగా వేధించాడు. ఎక్కడెక్కడో చేయి వేసి తడిమాడు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల ఓ మహిళ పైల్స్‌తో బాధపడుతూ మలాస్ ఈస్ట్ ఏరియాలోని ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రి చేయాలని వైద్యులు చెప్పారు. 
 
ఐతే ఆపరేషన్‌కు ముందు ముకేష్ ప్రజాపతి అనే వార్డు బాయ్ ఆమె గదిలోకి వెళ్లాడు. డాక్టర్లు మందు రామయని చెప్పారని కహానీ చెప్పి.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముందు రాస్తున్నట్లుగా నటించి ఎక్కడెక్కడో చేయి వేశాడు. లోపల చేయిపెట్టి ఉద్దేశ్వపూర్వకంగా ఆ మహిళ జననాంగాలను స్పృశించాడు.
 
ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధిత మహిళ ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఐనా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముకేష్ ప్రజపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రోగి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది పట్లా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం