Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్ రూల్స్ బ్రేక్ చేసిన సురేష్ రైనా - అరెస్టు.. విడుదల

Advertiesment
పబ్ రూల్స్ బ్రేక్ చేసిన సురేష్ రైనా - అరెస్టు.. విడుదల
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:35 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ సురేష్ రైనా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పబ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ముంబై ఎయిర్ పోర్టు సమీపంలోని 'డ్రాగన్ ఫ్లై పబ్'ను నిర్వాహకులు తెరిచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈ పబ్‌పై దాడులు చేసిన ముంబై పోలీసులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న సురేశ్ రైనా, గాయకుడు గురు రణధావా సహా 34 మందిని అరెస్టు చేశారు. అనంతరం వీరిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
 
కాగా, అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ అర్థాంగి సుజానే ఖాన్ కూడా ఉన్నారు. నిర్దేశించిన సమయం మించి పబ్ తెరిచి ఉంచారని, ఇతరత్రా నియమాల ఉల్లంఘన కూడా జరిగిందని అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. 
 
కాగా, సురేష్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్‌కు గత ఆగస్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే. సురేష్ రైనా 18 టెస్టులు, 226 వన్డే మ్యాచ్‌లు 78 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ - వధువుకు మలేషియా వార్నింగ్!