Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో మూడుకి చేరిన కరోనా మృతులు.. 7లక్షల మందికి టెస్టులు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (22:29 IST)
దేశ వాణిజ్య నగరం ముంబై ధారావిలో కరోనా మృతుల సంఖ్య 3కి చేరింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలో గురువారం ధారావిలో మరో కరోనా మృతి నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడంతో ఆ ప్రాంతంలో నివసించే లక్షలాది మంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ధారావిలో నివసించే ఏడు లక్షల మందికి రాబోయే 12 రోజుల్లో కరోనా టెస్టులు చేయనున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇందుకోసం ప్రైవేట్ వైద్యుల సాయం తీసుకోనున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. 
 
ఇకపోతే.. భారత్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం 1135 కరోనా కేసులు నమోదుకాగా, 72మంది మృతి  చెందారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments