వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వదలదు.. ఇంకా 18 నెలల టైమ్ పడుతుంది..?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (21:17 IST)
భారత్‌లో ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపించడం లేదని అమెరికాలోని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్‌కుమార్ ఝా చెప్తున్నారు. ఒకవేళ ఎత్తేసినా.. భారత్‌లో మళ్లీమళ్లీ లాక్‌డౌన్లు వస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే కరోనాపై ఆశిష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టదని, వ్యాక్సిన్ తయారు చేసే వరకు అది మనల్ని వదలదన్నారు. అంటే ఇంకా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని బాంబు పేల్చారు. 
 
అయితే కరోనా నుంచి తప్పించుకోవాలంటే రెండు మూడు మార్గాలే ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి మనం సామాజిక దూరం పాటించడం, రెండోది పరీక్షలు చేయించడం. మూడోది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఇదే సమయంలో భారత్ కరోనాపై చేస్తున్న పోరాటంపై కూడా ప్రస్తావించారు. 
 
అద్భుతమైన మేధోశక్తి భారత్ సొంతం అని కొనియాడారు. నిజానికి.. నమ్మశక్యం కాని ప్రతిభ భారత్‌లో ఉంది. స్థానికంగానే.. తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షల సమాగ్రిని కూడా తయారు చేయగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments