Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ చేతికి ముంబై విమానాశ్రయం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:50 IST)
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా అదానీ గ్రూప్‌ పరమైంది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌  (ఎంఐఏఎల్‌) నిర్వహణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌  అంతర్జాతీయ విమానాశ్రయంలో జీవీకే గ్రూప్‌న కు ఉన్న 50.5 శాతం వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎ్‌సఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌ నుంచి 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కొనుగోలుకు మంగళవారం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందుకు అధికారికంగా అనుమతులు లభించాయి. దీంతో ముంబై విమానాశ్రయ యాజమాన్య హక్కులు తమ వశమైనట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ముంబై ఎయిర్‌పోర్టును మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. స్థానికంగానూ వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

వచ్చే నెల నుంచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశయ్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. 90 రోజుల్లో నిధుల సమీకరణ ప్రణాళిక పూర్తి చేసి 2024 కల్లా నవీ ముంబై  విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కాగా ముంబై ఎయిర్‌పోర్టు విక్రయంతో దేశీయ విమానాశ్రయ రంగం నుంచి జీవీకే గ్రూప్‌ పూర్తిగా వైదొలిగినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments