Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:27 IST)
యుఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌తో శనివారం సత్కరించింది. 2015లో అరబ్‌ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్‌లోనే యూఏఈ ప్రకటించింది.

ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్‌ జాయేద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ పేరుతో ఇస్తారు. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం విశేషం. ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 60 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. యుఏఈ భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అలాగే యుఏఈ పెట్రోలియం ఉత్పత్తుల్లో భారత్‌ నాలుగో అతిపెద్ద దిగుమతిదారు. భారతదేశం నుంచి దాదాపు 33 లక్షల మంది యుఏఈలో పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments