Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న ఉత్తర భారతం.. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:31 IST)
ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దీనికి కారణం చలి. దీని ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీనగర్‌లో మాత్రం మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 5.3,16.2 డిగ్రీలుగా ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకునిపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments