Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న ఉత్తర భారతం.. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:31 IST)
ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దీనికి కారణం చలి. దీని ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీనగర్‌లో మాత్రం మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 5.3,16.2 డిగ్రీలుగా ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకునిపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments