Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బలూచిస్థాన్... పాక్ జవాన్లు మృతి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:17 IST)
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిపోయింది. బలుచిస్థాన్‌లోని లీడింగ్ పార్టీ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. అలాగే, క్వెట్టాలో వేర్వేరు జోట్ల గ్రేనేడు దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. 
 
ఈ నెల 24వ తేదీన నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఈఐడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో లీడింగ్ పార్టీ సమీపంలో పేలుడు సంభవించినట్టు పాకిస్థాన్ ఆర్మీని ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
 
ఇదిలావుంటే, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లోని ఓ పోలీస్ చెక్ పోస్టుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం