Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (20:15 IST)
ఎంతో సంతోషంగా తనతో భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన భార్య... తన ప్రియుడు కోసం ఏకంగా కిరాయి మనుషులతో కట్టుకున్న భర్తను హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎంపీగా ఉన్న కంగనా మేఘాలయా హానీమూన్ హత్యపై ఆమె స్పందిస్తూ, ఆమె విడాకులు తీసుకోలేకపోయింది. తన ప్రేమికుడితో పారిపోలేకపోయింది. ఎంత హేమయైన ప్రవర్తన ఇది. మూర్ఖులను ఎపుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థఁ కోసం ఇతరులను ఇబ్బంది కలిగిస్తారేమో గానీ తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడుతారో ఊహించలేం. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యానించారు.
 
దీన్ని అవివేక చర్యగా ఆమె అభివర్ణించారు. కన్న తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి భయపడిన ఒక మహిళ.. ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా? ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలిచివేసోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. తలనొప్పిగానూ ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, మేఘాలయాకు హనీమూన్ కోసం వెళ్లి రాజ్ రఘువంశీ, సోనాలీ దంపతుల ప్రయాణం విషాదాంతంగా ముగిసిన విషయం తెల్సిందే. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments