Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

Advertiesment
sonam raghuwanshi

ఠాగూర్

, సోమవారం, 9 జూన్ 2025 (17:01 IST)
హనీమూన్‌లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టు అయిన సోనమ్ రఘవంశీ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ బోరున విలపిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పోలీసులు మాత్రం సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల కథనం మేరకు.. ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గాజీపూరి్‌లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మా కుటుంబ సభ్యులకో ఫోన్ చేసి విషయం చెప్పాను అని సోనమ్ వివరించినట్టు సమాచారం. గాజీపూర్‌లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనమ్‌ను అరెస్టు చేశారు. ఆమె తన ఫోను నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు. 
 
ఇదిలావుంటే ఈ హత్య కేసులో సోనమ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తున్న రాజ్ కుశ్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్‌కు చెందిన చెందిన కుశ్వాహా, సోనమ్ సోదరుడు నడుపుతున్న ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా సోనమ్‌తో రాజ్ కుశ్వాహాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని ప్రణాళిక ప్రకారమే ఆమె తన భర్తను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం