Webdunia - Bharat's app for daily news and videos

Install App

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే...

Webdunia
బుధవారం, 3 మే 2023 (15:23 IST)
దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే. పంజాబ్ రాష్ట్రంలో చిరునామా చెప్పలేని ఓ అభాగ్యుడికి రూ.2.50 కోట్ల లాటరీ తగిలింది. కానీ, ఆ సొమ్ము ఇపుడు ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. ఎందుకు ఎలా అనే విషయాలను పరిశీలిస్తే,
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాకు చెందిన సాక్ష్ అనే సామాన్య వ్యక్తి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయగా, దానికి రూ.2.50 కోట్ల లక్కీ డ్రా తగిలింది. అయితే, ఈ లాటరీ టిక్కెట్ కొన్న వ్యక్తి రెండు అక్షరాల పేరు మినహా తన చిరునామా, ఫోన్ నంబరు ఏదీ రాయలేదు. ఇపుడు ఈ లాటరీ టిక్కెట్‌కు లక్కీ డ్రా వచ్చినా ఆ డబ్బును ఆ అభాగ్యుడికి అందజేయలేని పరిస్థితి. దీంతో ఇపుడు ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. 
 
కేవలం పేరు మాత్రమే రాస్తే గెలిచిన సొమ్ము పొందే అవకాశం ఉండదని, 249092 అనే నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న డబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలి. అతడు రాకపోతే ఆ సొమ్మును నేరుగా ప్రభుత్వం ఖజానాకు జమ చేస్తామని లాటరీ దుకాణం యజమాని తెలిపారు. ఆ వ్యక్తి చేసిన చిన్నపొరపాటు వల్ల రూ.2.50 కోట్లు గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments