Webdunia - Bharat's app for daily news and videos

Install App

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే...

Webdunia
బుధవారం, 3 మే 2023 (15:23 IST)
దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే. పంజాబ్ రాష్ట్రంలో చిరునామా చెప్పలేని ఓ అభాగ్యుడికి రూ.2.50 కోట్ల లాటరీ తగిలింది. కానీ, ఆ సొమ్ము ఇపుడు ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. ఎందుకు ఎలా అనే విషయాలను పరిశీలిస్తే,
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాకు చెందిన సాక్ష్ అనే సామాన్య వ్యక్తి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయగా, దానికి రూ.2.50 కోట్ల లక్కీ డ్రా తగిలింది. అయితే, ఈ లాటరీ టిక్కెట్ కొన్న వ్యక్తి రెండు అక్షరాల పేరు మినహా తన చిరునామా, ఫోన్ నంబరు ఏదీ రాయలేదు. ఇపుడు ఈ లాటరీ టిక్కెట్‌కు లక్కీ డ్రా వచ్చినా ఆ డబ్బును ఆ అభాగ్యుడికి అందజేయలేని పరిస్థితి. దీంతో ఇపుడు ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. 
 
కేవలం పేరు మాత్రమే రాస్తే గెలిచిన సొమ్ము పొందే అవకాశం ఉండదని, 249092 అనే నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న డబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలి. అతడు రాకపోతే ఆ సొమ్మును నేరుగా ప్రభుత్వం ఖజానాకు జమ చేస్తామని లాటరీ దుకాణం యజమాని తెలిపారు. ఆ వ్యక్తి చేసిన చిన్నపొరపాటు వల్ల రూ.2.50 కోట్లు గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments