వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!

Webdunia
సోమవారం, 13 జులై 2020 (18:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఒక వరుడు ఇద్దరు వధువులను పెద్దలు కుదిర్చిన ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వివాహానికి వధువులిద్దరూ సమ్మతించడమేకాకుండా, వారి తల్లిదండ్రులు కూడా అనుమతించారు. అలాగే, వరుడుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో ఈ పెళ్లి సుఖాంతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ఘోరాడోంగ్రీ బ్లాక్‌, కెరియా గ్రామానికి చెందిన సందీప్ యుకి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలోపడ్డాడు. ఈ విషయం తెలియక అతని తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు మరో యువతిని మాట్లాడారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన సందీప్ ప్రియురాలు... గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ పెద్దలు మూడు కుటుంబాలను పిలిచి మాట్లాడగా, ఇద్దరు యువతులు కలిసి సందీప్‌ను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. అలాగే, వరుడు కూడా వధువులిద్దరినీ వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఒకే ముహూర్తానికి వధువులిద్దరి మెడలో వరుడు తాళికట్టడంతో ఈ విచిత్రమైన పెళ్లి తంతు పూర్తయింది. ఈ వివాహం జూలై 8వ తేదీన ఘనంగా జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments