Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!

Webdunia
సోమవారం, 13 జులై 2020 (18:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఒక వరుడు ఇద్దరు వధువులను పెద్దలు కుదిర్చిన ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వివాహానికి వధువులిద్దరూ సమ్మతించడమేకాకుండా, వారి తల్లిదండ్రులు కూడా అనుమతించారు. అలాగే, వరుడుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో ఈ పెళ్లి సుఖాంతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ఘోరాడోంగ్రీ బ్లాక్‌, కెరియా గ్రామానికి చెందిన సందీప్ యుకి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలోపడ్డాడు. ఈ విషయం తెలియక అతని తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు మరో యువతిని మాట్లాడారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన సందీప్ ప్రియురాలు... గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ పెద్దలు మూడు కుటుంబాలను పిలిచి మాట్లాడగా, ఇద్దరు యువతులు కలిసి సందీప్‌ను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. అలాగే, వరుడు కూడా వధువులిద్దరినీ వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఒకే ముహూర్తానికి వధువులిద్దరి మెడలో వరుడు తాళికట్టడంతో ఈ విచిత్రమైన పెళ్లి తంతు పూర్తయింది. ఈ వివాహం జూలై 8వ తేదీన ఘనంగా జరిగింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments