Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు.. భార్య బతికిపోయింది..

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (15:42 IST)
భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సేలం, ఆత్తూరు సమీపం, కృష్ణాపురం గ్రామంలో భార్యశీలాన్ని శంకించాడు. తన ఇద్దరు పిల్లను కత్తితో హత్య చేశాడు. 
 
అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణాపురంలో అశోక్‌కుమార్‌ (42), తవమణి (38) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి విద్యారాణి (13), అరుళ్‌కుమారి (13) అనే ఇద్దరు కుమార్తెలు, అరుళ్‌ ప్రకాష్‌ (5) అనే కుమారుడున్నాడు. తాగుడుకు అలవాటు పడిన అశోక్‌కుమార్‌ భార్యను అనుమానించేవాడు. తవమణి శీలాన్ని శంకిస్తూ కొడుకు తనకు పుట్టలేదంటూ తవమణితో గొడవపెట్టుకున్నాడు. 
 
బుధవారం ఉదయం మరింత తాగి ఇంటికి చేరుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితో నిదురపోతున్న భార్యా, ముగ్గురు పిల్లలపై దాడి జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యారాణి, అరుళ్‌ ప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తవమణి, అరుళ్‌కుమారి తీవ్రంగా గాయపడ్డారు. 
 
నలుగురు మృతి చెందారని అనుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితోనే పక్కింటో దూరాడు. అతడిని చూసిన ఆ ఇంటిలోనివారు కేకలు వేశారు. పక్కింటివారు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments