Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాపై మనసుపడిన కుర్రోడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. చివరకు...

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (10:51 IST)
ఓ హిజ్రాపై ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం పెద్దలను ఎదిరించి హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. కానీ, నెల రోజులు కూడా తిరగకముందే వారిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు ప్రాంతానికి చెందిన దిలీప్ (26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెంచింది. ఫలితంగా వారిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయారు. దీంతో షివానీతో దిలీప్ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
వీరిద్దరి వ్యవహారం దిలీప్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులంతా గట్టిగా మందలించారు. అయినప్పటికీ దిలీప్ మాత్రం షివానీనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లిన దిలీప్... కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. 
 
ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తర్వాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments