Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాపై మనసుపడిన కుర్రోడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. చివరకు...

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (10:51 IST)
ఓ హిజ్రాపై ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం పెద్దలను ఎదిరించి హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. కానీ, నెల రోజులు కూడా తిరగకముందే వారిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు ప్రాంతానికి చెందిన దిలీప్ (26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెంచింది. ఫలితంగా వారిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయారు. దీంతో షివానీతో దిలీప్ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
వీరిద్దరి వ్యవహారం దిలీప్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులంతా గట్టిగా మందలించారు. అయినప్పటికీ దిలీప్ మాత్రం షివానీనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లిన దిలీప్... కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. 
 
ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తర్వాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments