Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ముగ్గురు మావోల హతం

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (14:04 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటరురో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలోని లోదంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒకరు మహిళ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మావోయిస్టులపై రూ.30 లక్షల వరకు రివార్డు ఉంది. 
 
"మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లా బహేలా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురిపైనా రివార్డ్‌ ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది" అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు. 
 
చనిపోయిన వారిలో డివిజినల్‌ కమిటీ సభ్యుడు నగేష్‌పైన రూ.15 లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్‌ మనోజ్‌తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్‌ రివార్డు ఉన్నట్లు వివరించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments