ఖండాంతర క్షిపణులను అడ్డుకునే యాంటీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (13:33 IST)
భారత్‌కు శత్రుదేశంగా ఉన్న చైనా ఆదివారం రాత్రి యాంటీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ ప్రయోగం చేపట్టినట్టు తెలిపింది. ఇది కేవలం చైనా ఆత్మరక్షణ చర్యల్లోభాగంగానే చేపట్టినట్టు పేర్కొంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో చైనా తన రక్షణ సంపత్తిని భారీగా పెంచుకుంటూ వస్తుంది. ఇందులోభాగంగా రక్షణ కోసం యాంటీ బాలిస్టిక్‌ మిసైల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఖండాంతర క్షిపణులు, ఇతర ప్రొజెక్టైల్స్‌ను అడ్డుకొంటుంది. 2010 నుంచి చైనా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా చేపట్టిన ఆరోపరీక్ష ఇది. గతంలో 2021 ఫిబ్రవరిలో నిర్వహించింది. ఉత్తర కొరియా - దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. 
 
అమెరికా ఈ ప్రాంతంలో దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల క్షిపణి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2016లో దక్షిణ కొరియాపై ఉ.కొరియా దాడి చేస్తుందనే భయంతో టర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ వ్యవస్థను మోహరించింది. ఈ విషయంలో చైనా-దక్షిణ కొరియా మధ్య విభేదాలు తలెత్తాయి. తమ జాతీయ భద్రతను ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దెబ్బతీస్తుందని చైనా వాదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments