Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...

suicide
, సోమవారం, 13 జూన్ 2022 (15:31 IST)
నా చావుకు నా భర్తే కారణం అంటూ గోడపై రాసిమరీ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గణాలోని ఫతేగఢ్‌కు చెందిన 42 యేళ్ల ఉమ అలియాస్ జ్యోతి అగర్వాల్‌కు ఫతేనగర్‌కు పురుగుల మందు వ్యాపారి దీపక్ అగర్వాల్ అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలంపాటు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో దీపక్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభమయ్యాయి. మరోవైపు, దీపక్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్య చేసుకునేముందు తనపై జరిగిన చిత్ర హింసల గురించి గోడలపై రాసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, కోటాలో నివసిస్తున్న ఓ మహిళ తన సంసారంలో నిప్పులు పోసిందని, తన చావుకు భర్తే కారణమని ఆమె గోడపై రాసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేటుగా నైరుతి రుతుపవనాలు.. ఒక్కసారిగా మారిన వాతావరణం