Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటు.. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త రూటును ఎంచుకున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఒకరు ఆగ్రా నివాసి కాగా, మరొకరు ఫరూఖాబాద్‌కు చెందినవారు. 
 
ఎల్‌పీజీ సిలిండర్లతో బైక్‌పై మెయిన్‌పురి పరిధిలోని బిచ్వాన్ ప్రాంతం గుండా వెళ్తున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా యువకులిద్దరూ ఖాకీలను తప్పుదోవ పట్టించారు. వారి మాటలు తేడాగా ఉండటంతో పోలీసులు గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించగా దాని బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. 
 
దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరు యువకులను గట్టిగా విచారించగా, సిలిండర్‌లో గంజాయి నింపినట్లు అంగీకరించారు. నిందితులను లఖన్, శివమ్‌లుగా గుర్తించారు. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments