రాముడు అడవిలో మాంసం తినేవాడు - ఎన్సీపీ నేత జితేంద్ర

సెల్వి
గురువారం, 4 జనవరి 2024 (12:50 IST)
కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తితో పూజించే శ్రీరాముడిపై ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు మాంసాహారి అని జితేంద్ర తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన మాట్లాడుతూ, "రాముడు బహుజనులకు చెందినవాడు. జంతువులను వేటాడి తినేవాడు. రాముడు ఒక మాంసాహారి. రాముడు 14 సంవత్సరాలు అడవిలో నివసించాడు, అక్కడ అతనికి అరణ్యాలలో మాంసాహారం, శాకాహారం తీసుకునేవాడు.." అంటూ జితేంద్ర వ్యాఖ్యానించారు. 
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సమయంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత రామ్ కదమ్ తెలిపారు. రాముడు మాంసం తినేవాడని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆరోపించారు. జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments