Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి (వీడియో)

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (12:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావును ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడ నుంచి కేసీఆర్ ఉంటున్న బంజారా హిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి చేరుకుని పరామర్శించారు. 
 
ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి జగన్‌ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments