Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 
 
ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదిని లష్కరే తాయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. 
 
గురువారం మధ్యాహ్నం కుల్గామ్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ముష్కరుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయని, దీంతో దురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతమయ్యాడని ఐటీ వెల్లడించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments