Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం.. పురుగుల మందు సేవించి చనిపోయాలా చేశారు..

అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం.. పురుగుల మందు సేవించి చనిపోయాలా చేశారు..
, బుధవారం, 11 ఆగస్టు 2021 (08:41 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. అక్కా చెల్లెళ్ళపై నలుగురు వలస కార్మికులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాళ్లే స్వయంగా బలవన్మరణానికి పాల్పడేలా ఒత్తిడి చేశారు. పురుగుల మందు తాగి చనిపోయేలా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని కూడా బెదిరించారు. ఆఖరికి పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటున్నది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటున్నది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు. 
 
వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు.
 
అయితే.. ఆత్మహత్యకు పాల్పడిన అక్కాచెల్లళ్లను స్థానికులు ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఒకరు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరొక అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. పాము కాటేసిందని వారి తల్లి వైద్యులకు చెప్పింది. 
 
కానీ, పోస్ట్ మార్టం రిపోర్టులో వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కలకలం - హడలిపోయిన పోలీసులు