Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టు షాక్..

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:50 IST)
దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ యాదవ్.. తన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేవేసింది. లాలూకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇపుడే ఆస్పత్రి నుంచే రాజకీయం చేస్తున్నారని, ఇక బెయిల్ ఇస్తే పూర్తి స్థాయి రాజకీయనేతగా మారిపోతారని వ్యాఖ్యానించింది. 
 
అయితే, లాలూ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ, లాలూకు కోర్టు 14 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష విధించిందని, 25 ఏళ్లు కాదని, ఆయన ఎక్కడికి పారిపోరంటూ వాదన వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్.. సిబాల్ వాదనను తోసిపుచ్చారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులను వేగవంతంగా విచారించాల్సిందిగా హైకోర్టుకు సూచిస్తామన్నారు. 
 
లాలూకు విధించిన 14 ఏళ్ల శిక్షాకాలంలో 24 నెలలు మాత్రమే శిక్ష అనుభవించారని కోర్టు గుర్తు చేసింది. ఈ సందర్భంగా లాలూకు బెయిల్ మంజూరు చేస్తే ప్రమాదామా? అని సిబల్ కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం.. బెయిల్ ఇవ్వడంలో ప్రమాదం ఏమి లేదు. ఆయన దోషిగా తేలిన ఖైదీ తప్ప. అందుకే లాలూ బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments