Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాలు నవ్వు నవ్వు.. కేంద్రానికి బానిసగా మారిన సర్కారు: ఖుష్బూ ఫైర్

తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:54 IST)
తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని కమల్ హాసన్ ట్వీట్ చేసిన తరుణంలో... తమిళ రాజకీయాలను చూసి ప్రపంచం నవ్వుతోందని అన్నారు. నాలుగేళ్లు కేంద్రానికి తమిళనాడు సర్కారు బానిసగా ఉంటుందన్నారు.
 
బీజేపీ ఒత్తిడితోనే పన్నీరు, పళని వర్గాలు విలీనమయ్యాయని, అన్నాడీఎంకే వర్గాల విలీనంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామికి వేరే అవకాశం లేక విలీనమయ్యారని తేల్చిచెప్పారు. నిన్నటి దాకా తిట్టుకున్న నేతలు ఇప్పుడెలా ఏకమయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ విలీనం వల్ల ప్రజలకు ఒరిగేదేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి రాజకీయాల ద్వారా పాగా వేయాలని కుయుక్తులు పన్నుతోందని ఖుష్బూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments