Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాలు నవ్వు నవ్వు.. కేంద్రానికి బానిసగా మారిన సర్కారు: ఖుష్బూ ఫైర్

తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:54 IST)
తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని కమల్ హాసన్ ట్వీట్ చేసిన తరుణంలో... తమిళ రాజకీయాలను చూసి ప్రపంచం నవ్వుతోందని అన్నారు. నాలుగేళ్లు కేంద్రానికి తమిళనాడు సర్కారు బానిసగా ఉంటుందన్నారు.
 
బీజేపీ ఒత్తిడితోనే పన్నీరు, పళని వర్గాలు విలీనమయ్యాయని, అన్నాడీఎంకే వర్గాల విలీనంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామికి వేరే అవకాశం లేక విలీనమయ్యారని తేల్చిచెప్పారు. నిన్నటి దాకా తిట్టుకున్న నేతలు ఇప్పుడెలా ఏకమయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ విలీనం వల్ల ప్రజలకు ఒరిగేదేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి రాజకీయాల ద్వారా పాగా వేయాలని కుయుక్తులు పన్నుతోందని ఖుష్బూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments