Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలను వెర్రివెంగళప్పలను చేశారు.. అన్నాడీఎంకే విలీనంపై కమల్ ట్వీట్

తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలు విలీనం కావడంపై సినీ హీరో కమల్ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

ప్రజలను వెర్రివెంగళప్పలను చేశారు.. అన్నాడీఎంకే విలీనంపై కమల్ ట్వీట్
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:27 IST)
తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలు విలీనం కావడంపై సినీ హీరో కమల్ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తమిళ ప్రజలను వెర్రివాళ్లను చేసిన దేశంలో ఉన్న అన్ని రకాల టోపీలను పెట్టారంటూ వ్యాఖ్యానించారు. 
 
సోమవారం అన్నాడీఎంకేలోని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ తాజా రాజకీయ ప‌రిణామాల‌పై క‌మ‌లహాస‌న్ స్పందించారు. 
 
పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని ఆయ‌న కామెంట్ చేశారు. త‌మిళుల త‌ల మీద గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీల‌తో పాటు ఇప్పుడు జోక‌ర్ టోపీ కూడా పెట్టార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
 
కాగా, సోష‌ల్ మీడియా ద్వారా త‌మిళ రాజకీయాల‌పై ప్ర‌భావం చూపించ‌డానికి ప్ర‌భుత్వ ప‌నితీరుపై స్పందించాల్సిందిగా త‌న అభిమానుల‌ను క‌మ‌ల్ ఉసిగొల్ప‌డంపై త‌మిళ ప్ర‌భుత్వం ఒకింత‌ అస‌హ‌నంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పైగా, కమల్ ట్వీట్లపై మంత్రులు కూడా తమకుతోచిన విధంగా స్పందిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ 'రంగస్థలం'లో బోయపాటి విలనా?