Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కరోనా కల్లోలం : కఠిన ఆంక్షలతో 48 గంటల లాక్డౌన్

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (09:32 IST)
కేరళ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో కఠిన ఆంక్షలతో 48 గంటల పాటు లాక్డౌన్ అమల్లోకిరానుంది. కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో కేరళలో ఆంక్షలు విధించారు. 
 
ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్‌ అమలు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసింది. ఇందులో భాగంగా 48 గంటల పాటు లాక్డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది.
 
కేరళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పోలీసులు నిబంధనలు పాటించనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. సరైన పత్రాలను చూపించిన వారిని మాత్రమే వదిలేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్లలో రద్దీ తగ్గింది. 
 
కేరళలో శుక్రవారం కొత్తగా రికార్డుస్థాయిలో 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తెచ్చినవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments