Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు నాతో ఆడుకోవట్లేదు.. వారిని అరెస్ట్ చేయండి.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు

Webdunia
గురువారం, 14 మే 2020 (10:07 IST)
కేరళలో ఓ బాలుడు వింతగా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తన సోదరితో పాటు ఐదుగురు బాలికలు తనతో ఆడేందుకు నిరాకరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని ఎనిమేదేళ్ల బాలుడు సాక్షాత్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో వెలుగుచూసింది. 
 
అమాయకుడైన 8ఏళ్ల ఉమర్ నిదమ్ అక్కతోపాటు బాలికలు తనతో ఆటలు ఆడటం లేదని తన తండ్రితో చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా చెబితే బాలుడు నిజంగా ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాను అబ్బాయినని తనతో లుడో, షటిల్, దొంగ పోలీసు ఆటలను అక్కతో పాటు ఐదుగురు బాలికలు ఆడటం లేదని ఉమర్ నిదర్ అనే బాలుడు కస్బా పోలీసుస్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
లాక్ డౌన్ వల్ల తాను బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి నెలకొందని, స్నేహితులతో కాకుండా అక్కతో కలిసి ఆడుకుందామంటే వారు ఎగతాళి చేస్తున్నారని మూడోతరగతి చదువుతున్న ఉమర్ నిదర్ ఇంగ్లీషులో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు ఉమేష్, నీరజ్‌లు బాలుడి ఇంటికి వచ్చి బాలుడి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపారు. తనను కూడా ఆడేందుకు అనుమతించాలని కోరినా బాలికలు తిరస్కరించారని బాలుడు పోలీసులకు చెప్పాడు. బాలుడితో కలిసి ఆడాలని తాను బాలికలకు సలహా ఇచ్చామని పోలీసు అధికారి నీరజ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments