Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లికి నిరాకరించాడనీ ప్రియుడి ఇంటికి నిప్పంటించిన యువతి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (09:26 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ యువతి ప్రియుడిపై తిరగబడింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆ ప్రియుడి నడిపే ఆటోతో పాటు అతని ఇంటిపై పెట్రోల్ పోటి నిప్పంటించింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బసవకళ్యాణ తాలూకా హిప్పరగా గ్రామానికి చెందిన భీమరావు అనే యువకుడు తన తల్లితో కలిసి సస్తాపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో భీమారావుకు సుమ అనే యువతి పరిచయమై అది ప్రేమగా మారింది. ఫలితంగా గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి పదేపదే ఒత్తిడి చేయసాగింది. 
 
దీంతో భీమరావు తన తల్లిని తీసుకుని హిప్పరగా గ్రామానికి మకాం మార్చాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ యువతి.. ప్రియుడికి తగిన గుణపాఠం నేర్పాలని భావించింది. ఆ విధంగా అనుకున్నదే తడవుగా తన మనుషులను తీసుకుని భీమరావు ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అందుకు అతడు నిరాకరించడంతో ఆటోను, అతను నివశించే ఇంటికే నిప్పుపెట్టింది. దీనిపై భీమరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments