Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు తీర్థంలా భావించి తాగిన బీజేపీ కార్యకర్త

అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగి

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:27 IST)
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా సెగ్మెంట్ ఎంపీ నిషికాంత్‌ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా, కన్హావరా అనే గ్రామానికి వెళ్లారు. ఓ బ్రిడ్జిని నిర్మిస్తానని ప్రకటించిన దూబే ప్రసంగం పూర్తి కాగానే పళ్లెంతో వచ్చిన పవన్‌ అనే బీజేపీ కార్యకర్త ఎంపీ కాళ్లు కడిగాడు. 
 
అంతటితో ఆగక ఆ నీళ్లను తాగేశాడు. ఆ సమయంలో ఎంపీ అతణ్ని వారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ చర్యను ఆ కార్యకర్త సమర్థించుకున్నాడు. ఆయన తమకు అత్యంత ప్రియతమైన నేత అని, అందుకే అలా చేసినట్టు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments