Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

సెల్వి
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (09:17 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఉజ్వల్ కోటలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జరిగింది. అతను గత రెండేళ్లుగా హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తరగతులకు హాజరవుతూ జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
 
ఈ నేపథ్యంలో కోటాలో రైల్వే ట్రాక్‌పై పడి ఉజ్వల్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. ముంబై-ఢిల్లీ రైల్వే లైన్‌లో అతని ఐడి కార్డు, మొబైల్ ఫోన్ ద్వారా అధికారులు అతన్ని గుర్తించారు.
 
ఉజ్వల్ ఏప్రిల్ 2న లక్నోలో జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. అతని తండ్రి సోమవారం కోటాకు వెళ్లి పరీక్ష కోసం లక్నోకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అయితే, అది జరగకముందే, తన కొడుకు మరణ వార్త షాకిచ్చిందని అతని తండ్రి దీపక్ మిశ్రా తెలిపారు. 
 
ఇంకా దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. "విద్యార్థులు తరచుగా ఒత్తిడిని అనుభవిస్తున్నారని మేము గమనించాము, కానీ వారు దానిని వ్యక్తపరచలేకపోతున్నారు. నేను అతనిని తీసుకెళ్లడానికి వస్తున్నానని అతనికి చెప్పాను.." అని అన్నారు. 
 
ఉజ్వల్ చివరిసారిగా తన తండ్రితో శనివారం రాత్రి 11 గంటలకు మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని జీఆర్పీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధర్మ్ సింగ్ ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments