Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (09:10 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి నలుగురు ఆచూకీ తెలియడం లేదు. మరికొందరు గాయపడ్డారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు సంభవించిన ఇంటిని కొందరు బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భారీ శబ్దంతో ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 
 
పేలుడు సంభవించి సమయంలో ఇంట్లో 11 మంది ఉండగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments