Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మోడీనే... ఏపీలో వైకాపా గెలుస్తుందా? ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు?

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (15:11 IST)
దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటే ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అయితే, పోలింగ్‌కు చివరి పది రోజుల్లో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. 
 
ఆయన ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీహార్‌లో పని చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలకు ఎన్నికల సేవలను వదిలి జేడీయూలో చేరానన్నారు. జేడీయూ చిన్న పార్టీయే అయినా దానికి ఇబ్బందికర చరిత్ర లేకపోవడం తనను ఆకర్షించిందని అన్నారు. తాను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కూడా కలిసి పని చేశానని, నేటి యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడం చాలా కష్టమైన విషయమన్నారు. 
 
ఇకపోతే, 'నా లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు బీజేపీయే ముందుంది. ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా చివరి 10-12 రోజులే కీలకమని నా పన్నెండేళ్ల అనుభవం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు వేసే అంచనాలన్నీ అపరిపక్వమైనవే. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీదే అధికారం' అని చెప్పారు. 
 
అదేసమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టం అని అభిప్రాయపడ్డారు. 'విపక్షం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్న దానికంటే ఇతర అంశాలే ఎక్కువగా పని చేస్తాయి. దేశంలో 70 శాతం ప్రజల దినసరి ఆదాయం వంద రూపాయలు కూడా లేదు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. అందుకే దేశంలో ప్రతీ ఎన్నికలూ నాయకులకు షాక్‌ ఇస్తుంటాయి' అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు పరిస్థితి కూడా ఏమంత సానుకూలంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పరిస్థితులు మారిపోవచ్చన్నారు. అయితే, వైకాపా, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం ఫలితం అనుకూలంగా ఉంటుందన్నారు. కానీ, టీడీపీ, వైకాపా, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే మాత్రం ఫలితాలు మరోలా ఉంటాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments