Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవలు.. బావిలో పిల్లల్ని పడేసిన జవాన్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:49 IST)
భార్యాభర్తల గొడవలకు పిల్లలు బలైపోయారు. ఆడుకుంటున్న తన కొడుకు, కూతురిని తీసుకెళ్లి కన్న తండ్రి బావిలో పడేశాడు ఓ జవాన్. ఈ  ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు కన్న బిడ్డలను కడతేర్చాడు. వారిని వ్యవసాయబావిలో పడేశాడు. 
 
పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి పొలం వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. కొడుకు అమ్మి జాక్సన్, కూతురు జానీ బేస్టోను వ్యవసాయ బావిలోకి నెట్టాడు. ఇంకొద్ది రోజుల్లో కొడుకు పుట్టిన రోజు ఉండగా ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల్ని బావిలోకి తోసేసిన అనంతరం వారి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు.
 
 
ఈ నిందితుడు ప్రస్తుతం ముంబయిలో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శిరీషతో కుటుంబ కలహాలు ఉన్నాయని ఇరుగుపొరుగువారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments