Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవలు.. బావిలో పిల్లల్ని పడేసిన జవాన్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:49 IST)
భార్యాభర్తల గొడవలకు పిల్లలు బలైపోయారు. ఆడుకుంటున్న తన కొడుకు, కూతురిని తీసుకెళ్లి కన్న తండ్రి బావిలో పడేశాడు ఓ జవాన్. ఈ  ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు కన్న బిడ్డలను కడతేర్చాడు. వారిని వ్యవసాయబావిలో పడేశాడు. 
 
పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి పొలం వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. కొడుకు అమ్మి జాక్సన్, కూతురు జానీ బేస్టోను వ్యవసాయ బావిలోకి నెట్టాడు. ఇంకొద్ది రోజుల్లో కొడుకు పుట్టిన రోజు ఉండగా ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల్ని బావిలోకి తోసేసిన అనంతరం వారి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు.
 
 
ఈ నిందితుడు ప్రస్తుతం ముంబయిలో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శిరీషతో కుటుంబ కలహాలు ఉన్నాయని ఇరుగుపొరుగువారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments