Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుక్మా జిల్లాలో 38మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా

సుక్మా జిల్లాలో 38మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా
, మంగళవారం, 4 జనవరి 2022 (13:21 IST)
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరున్న సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. సిఆర్‌పిఎఫ్‌లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్‌ చేసామని అధికారులు తెలిపారు.
 
202 బెటాలియన్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) అనేది సీఆర్‌పీఎఫ్‌లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం (జనవరి 2,2022)సుక్మాకు వచ్చారని తెలిపారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌లో భాగంగా 75 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీవీ బన్సోడ్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ