Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో కొత్త జబ్బు.. నల్లిన పోలిన పురుగులతో?

Advertiesment
Hyderabad
హైదరాబాదును కొత్త వైరస్ పట్టిపీడిస్తోంది. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ముప్పుతో జనం జడుసుకుంటున్న తరుణంలో  నగరంలో స్క్రబ్‌ టైఫస్‌ బాధితులు ఎక్కువయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏకంగా 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ బాధితుల్లో పిల్లలే ఎక్కువమంది ఉన్నారట. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
 
ఈ స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుంది. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయి. 
 
అంతేకాదు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై కక్షగ‌ట్టారు.... హిందూ ధ‌ర్మాన్ని కాల‌రాస్తున్నారు: అశోక్‌ గజపతిరాజు