Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:57 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) అనే వ్యాధి వణికిస్తుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి సోకిన మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అలాగే, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో రోగులు బాధపడుతారు. పైగా, ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిస్తుండటంతో అస్సాం వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిన 15 రోజుల్లోనే 23 మంది అస్సామీయులు చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. శుక్రవారం మరో నలుగురు మృత్యువాతపడినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది. 
 
ఈ రాష్ట్రంలోని బార్‌పేట్, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ, అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 160 కేసులు నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments