Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:57 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) అనే వ్యాధి వణికిస్తుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి సోకిన మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అలాగే, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో రోగులు బాధపడుతారు. పైగా, ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిస్తుండటంతో అస్సాం వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిన 15 రోజుల్లోనే 23 మంది అస్సామీయులు చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. శుక్రవారం మరో నలుగురు మృత్యువాతపడినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది. 
 
ఈ రాష్ట్రంలోని బార్‌పేట్, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ, అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 160 కేసులు నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments