Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:57 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) అనే వ్యాధి వణికిస్తుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి సోకిన మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అలాగే, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో రోగులు బాధపడుతారు. పైగా, ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిస్తుండటంతో అస్సాం వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిన 15 రోజుల్లోనే 23 మంది అస్సామీయులు చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. శుక్రవారం మరో నలుగురు మృత్యువాతపడినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది. 
 
ఈ రాష్ట్రంలోని బార్‌పేట్, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ, అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 160 కేసులు నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments