Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో కొత్తగా 18 వేల కరోనా పాజిటివ్ కేసులు

Covid Vaccine
, ఆదివారం, 10 జులై 2022 (10:31 IST)
దేశంలో కొత్తగా 18,257 మంది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 18257 మందికి ఈ వైరస్ సోకింది. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కొవిడ్​ నుంచి తాజాగా 14,553 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.30 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది. 
 
కాగా, ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,36,22,651, అలాగే, ‬మొత్తం మరణాల సంఖ్య 5,25,428గా ఉండగా, యాక్టివ్ కేసులు 1,28,690గా ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 4,29,68,533గా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని