Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్‌ విరిగిపడిన కొండ చరియలు - 37కు చేరిన మృతులు

landslides
, సోమవారం, 4 జులై 2022 (09:54 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37కు చేరింది. 
 
జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇంకా 25 మంది కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వర్షాలు ఈ గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు ముగుస్తుండటంతో ఆచూకీ లభించని వారంతా మృతి చెందివుంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నట్లు తెలుస్తోంది.
 
శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 24 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 13 మంది పౌరులు ఉన్నారని గౌహతిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆచూకీ లభించని ఆరుగురు జవాన్లు, 19 పౌరుల కోసం గాలిస్తున్నామని, చివరి వ్యక్తి దొరికేవరకు చర్యలు కొనసాగుతాయన్నారు. 
 
ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు - 19 మంది మృత్యువాత