Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారా? ఛైర్మన్ శివన్ ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (22:54 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖలో ప్రైవేటు రైళ్ళు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే, అంతరిక్ష పరిశోధనలు జరిపే ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇస్రో ఛైర్మన్ కె. శివన్ నాయర్ స్పష్టతనిచ్చారు. 
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన గురువారం తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, ఇస్రో ప్రైవేటుపరం కాదని గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని స్పష్టతనిచ్చారు. 
 
'ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments