Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకట్లో ఏకాంతంగా గడిపిన ప్రేమికులు.. పట్టుకుని గుండు గీయించిన స్థానికులు...

ఠాగూర్
గురువారం, 7 ఆగస్టు 2025 (09:13 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట చీకటిలో ఏకాంతంగా కలుసుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని పట్టుకుని గుండు గీయించి, గ్రామంలో ఊరేగించారు. ఇది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని రహతా గ్రామానికి చెందిన 40 యేళ్ల షకీల్, 32 యేళ్ళు సునీత మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరికీ ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. వారు రహస్యంగా కలుసుకోగా గ్రామస్థులు గుర్తించి పట్టుకున్నారు. 
 
ఈ విషయం బయటపడగానే షకీల్ భార్య పోలీసులను ఆశ్రయించి సాయం అర్థించింది. స్థానిక పంచాయతీ పెద్దల ఆదేశాల మేరకు ఈ జంటపై గ్రామస్థులు దాడి చేశారు. అంతటితో ఆగని వారు.. వారికి గుండు గీయించి, గ్రామంలో ఊరేగించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments