Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు.. అయినా మద్యం షాపులు తెరుస్తారట...

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:04 IST)
దేశంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం 50 మందికి పైగా జర్నలిస్టులకు కూడా ఈ వైరస్ సోకింది. ఇక్కడ పరిస్థితులు దిగజారిపోతుంటే.. మహారాష్ట్ర సర్కారు మాత్రం మద్యం దుకాణాలు తెరిచేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె స్పందిస్తూ, 'ప్రజలు కనుక భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మద్యం దుకాణాలను మూసేయాల్సిన అవసరం ఏముంది? కరోనాను కట్టడి చేయాలంటే కాస్త కఠినంగానే వ్యవహరించాలి. మద్యంపై నిషేధం అందులో భాగమే' అని వివరించారు. మహారాష్ట్రలో సోమవారం నుంచి పాక్షిక స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
లాక్‌డౌన్ వల్ల మద్యం బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుకు దూరంగా ఉండలేక, అలా అని దాన్ని సాధించుకోలేక మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో వస్తున్న కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదహారణ. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దాదాపుగా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments