హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్న ఇండియన్ ఎయిర్ చీఫ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:24 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అనే కొండ అటవీ ప్రాంతంలో భారత రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రాంతాన్ని భారత్ వైమానికదళ అధిపతి వీఆర్ చౌదరి సందర్శించనున్నారు. అలాగే, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నీలగిరికి రానున్నారు. వీరిద్దరూ కన్నూరులోని సూళూరు ఎయిర్ బేస్ కేంద్రాన్ని సందర్శిస్తారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వివరాలు తెలియాల్సివుంది. ఈ హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిలో మధులిక రావత్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు.
 
ఇదిలావుంటే అస్సలు బిపిన్ రావత్ కన్నూరుకు ఎందుకు వెళ్లారో పరిశీలిస్తే, కన్నూరుకు సమీపంలో ఉన్న వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ కేంద్రంలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన హాజరై కీలక ప్రసంగం చేయాల్సివుంది. ఈ కేంద్రంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. 
 
కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన ఈ హెలికాఫ్టర్ కాట్టేరి వద్ద కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? లేక విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments