Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర ఎఫెక్ట్ : హైదారాబాద్‌లో స్కూల్స్‌కు సెలవు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (11:15 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పాదయాత్రను కొనసాగిస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 
 
ముఖ్యంగా, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బానానగర్, బోయిన్‌పల్లి తదిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. దీనికి కారణం లేకపోలేదు. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మార్పులు చేశారు. అనేక ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతో స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు. 
 
ఇదిలావుంటే, ఈ యాత్ర బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అంతేకాకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా నగర వాసులకు ఓ విన్నపం చేశారు. బోయిన్‌పల్లి, బాలా నగర్, వై జంక్షన్, జేఎన్టీయూ, చాంద్ నగర్‌ ప్రాంతాలకు వెళ్లకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments