Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం సిద్ధమైన హైదరాబాద్‌, నవంబర్‌ 15 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 25% డిస్కౌంట్

image
, మంగళవారం, 1 నవంబరు 2022 (15:53 IST)
ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు రన్నర్లకు జీవితకాలపు అనుభవాలను అందిస్తూ మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను 29 జనవరి 2022వ తేదీన నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. నవంబర్‌ 15, 2022వ తేదీ లోపుగా రన్‌ కోసం నమోదు చేసుకునే వారికి 25% వరకూ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ను సైతం అందించనున్నారు. తద్వరా 5కె రన్‌ కోసం 699 రూపాయలు, 10 కిలోమీటర్ల పరుగుకు 1199 రూపాయలు, 21 కిలోమీటర్ల రన్‌కు 1499 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి) చెల్లిస్తే సరిపోతుంది.

 
ఈ మారథాన్‌ ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద ప్రారంభమవుతుంది. ఈ రన్‌ హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్‌ అయిన దుర్గం చెరువు బ్రిడ్జ్‌పై సాగుతుంది. ఈ రన్‌లో పాల్గొనేవారు తమ బిబ్స్‌పై పేర్లను సైతం తాము కోరుకున్నట్లుగా పొందవచ్చు. ఈ రన్‌లో నమోదు చేసుకున్న వారందరూ 1500 రూపాయల ఖచ్చితమైన బహుమతితో పాటుగా టీ షర్ట్‌, గుడీస్‌ బ్యాగ్‌ను సైతం పొందవచ్చు.

 
ఈ మారథాన్‌ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ నిర్వహిస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం పరుగు అని ఈ కంపెనీ ప్రచారం చేస్తుంది. సేవా రంగంలో దివ్యాంగులకు  ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా నైపుణ్యాభివృద్ధి అందించే దిశగా ఈ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఎన్‌జీఓ నిర్మాణ్‌ దీనికి చారిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

 
ఈ సంవత్సర జనవరిలో, ఈ మాల్‌ విజయవంతంగా రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను నిర్వహించింది. ఈ రన్‌లో 3200 మంది వ్యక్తులతో సహా 90 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. మొత్తంమ్మీద 30 లక్షల రూపాయలను దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం సమీకరించారు. ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023ను కోవిడ్‌ 19 స్పోర్ట్స్‌ సేఫ్టీ ప్రమాణాలను అనుసరిస్తూ నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి