భార్యకు మరొకరితో లింక్ ఉందన్న అనుమానం, చనిపోయేదాకా పొడిచాడు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (15:59 IST)
మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఒక వ్యక్తి సొంత భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో గురువారం వెలుగు చూసింది. మృతురాలు.. తన బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన ఆమె భర్త పదునైన పెద్ద కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. పలుమార్లు పొడిచి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని గోరయ పట్టణంలో జశ్వంత్ సింగ్, కుల్విందర్ సింగ్ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలాకాలం అయింది. నలభై ఏళ్ల కుల్విందర్ సింగ్.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని జశ్వంత్ సింగ్ పదే పదే గొడవ పడేవాడు. 
 
ఇదే విషయం మీద వారిద్దరికీ చాలాసార్లు గొడవలయ్యాయి. ఈ క్రమంలోనే కుల్విందర్.. జశ్వంత్‌తో గొడవ పడి తన బంధువుల ఇంటికి చేరింది. అయితే అక్కడకు చేరిన జశ్వంత్.. ఆమెతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగింది.
 
దీంతో సహనం కోల్పోయిన జశ్వంత్.. వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని తీసుకుని ఆమె కడుపులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments