Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భర్త నాకొద్దు, చంపేద్దామంటూ ప్రియుడిని ఉసిగొల్పిన భార్య

నా భర్త నాకొద్దు, చంపేద్దామంటూ ప్రియుడిని ఉసిగొల్పిన భార్య
, బుధవారం, 16 డిశెంబరు 2020 (23:04 IST)
తమిళనాడు రాష్ట్రం హోసూరు ప్రాంతమది. సరిగ్గా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతమే హోసూరు. ఈ ప్రాంతంలోని ఎర్రమిట్టలో నివాసముండే ధనపాల్, సత్యలకు 18 నెలల క్రితం వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. 
 
ధనపాల్ ప్రాణస్నేహితుడు మణికంఠన్. ధనపాల్, మణికంఠన్ ఇద్దరు కూడా మేస్త్రీ పనిచేసేవారే. చిన్పప్పటి నుంచి ఇద్దరూ కలిసి చదువుకోవడం.. తిరగడం చేసేవారు. కాబట్టి ఒకరంటే ఒకరికి నమ్మకం. అలా ప్రతిరోజు స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు మణికంఠన్. మణికంఠన్ తరచూ ఇంటికి రావడంతో సత్య అతడి పట్ల ఆకర్షితురాలైంది. ఆమెను చూసిన మణికంఠన్ ఎలాగైనా ఆమెతో గడపాలనుకున్నాడు. స్నేహితుడి భార్య కదా అని కొన్నిరోజులు ఊరుకున్నాడు.
 
కానీ సత్య మాత్రం వెనక్కి తగ్గలేదు. మణికంఠన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకుంది. అతన్ని ముగ్గులోకి దింపింది. స్నేహితుడికి అన్యాయం చేయకూడదని ముందుగా భావించినా సత్య ఒత్తిడి చేయడంతో ఇక మణికంఠన్ కూడా రంగంలోకి దిగాడు.
 
ఇలా రెండునెలల పాటు వీరి బాగోతం సాగింది. స్నేహితుడు ధనపాల్‌కు ఎలాంటి అనుమానం రానివ్వలేదు. కానీ ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో చివరకు మేల్కొన్నాడు ధనపాల్. తన స్నేహితుడు, భార్య ఇద్దరూ కలిసి ఉండటాన్ని కళ్ళారా చూసి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. పంచాయతీ పెట్టాడు. పెద్దలు వార్నింగ్ ఇచ్చి పంపించారు.
 
కానీ సత్య భర్తను వద్దనుకుంది. మణికంఠన్ తోనే ఉండిపోవాలనుకుంది. దీంతో భర్తను రెండు రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత ఉరి వేసుకున్నట్లు ఫ్యాన్‌కు ఉరితీసి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడి చివరకు నిందితులు కటాకటాల పాలయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సఫోలా తేనె 100% స్వచ్ఛమైనది, స్వచ్ఛత సర్టిఫికెట్‌తో లభిస్తుంది