Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్సేపై పొగడ్తలు - గాంధీపై విమర్శలు.. కాళీచరణ్ మహారాజ్ అరెస్టు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:17 IST)
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కాళీచరణ్ మహరాజ్ నోటిదూలను ప్రదర్శించి జైలుపాలయ్యాడు. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు. అలాగే, ఇస్లాం మతాన్ని కించపిరిచేలా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో చత్తీస్‌గఢ్ పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల రాయ్‌పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. గాంధీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
 
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశారనీ, అందుకే ఆయన్ను చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.
 
ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కాళీచరణ్ మహారాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో అరెస్టు చేసి రాయపూర్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments