Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోరం.. చెట్టు కూలి ఏడుగురు భక్తులు మృతి

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (11:19 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్‌ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా అకోలా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఈదురుగాలుల వీస్తున్నాయి. వీటి కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వందేళ్ల నాటి భారీ వేప వృక్షం... ఆదివారం పూజలు జరుగుతున్న సమయంలో నేల కూలి రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో ఆ షెడ్డు కుప్పకూలి దాని కింద భక్తులు చిక్కుకుపోయారు.
 
సమాచారమందుకున్న పోలీసులు.. ఎమర్జెన్సీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుల్‌డోజర్‌ సాయంతో వృక్షాన్ని తొలగించారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments