మహారాష్ట్రలో ఘోరం.. చెట్టు కూలి ఏడుగురు భక్తులు మృతి

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (11:19 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్‌ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా అకోలా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఈదురుగాలుల వీస్తున్నాయి. వీటి కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వందేళ్ల నాటి భారీ వేప వృక్షం... ఆదివారం పూజలు జరుగుతున్న సమయంలో నేల కూలి రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో ఆ షెడ్డు కుప్పకూలి దాని కింద భక్తులు చిక్కుకుపోయారు.
 
సమాచారమందుకున్న పోలీసులు.. ఎమర్జెన్సీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుల్‌డోజర్‌ సాయంతో వృక్షాన్ని తొలగించారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments