Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో దళితుడిని కొట్టి చంపిన ఫ్యాక్టరీ ఉద్యోగులు... (వీడియో)

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తిని దొంగ అని భావించిన ఓ ఫ్యాక్టరీ ఉద్యోగులు కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 22 మే 2018 (09:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తిని దొంగ అని భావించిన ఓ ఫ్యాక్టరీ ఉద్యోగులు కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్న ముఖేష్ వనియా అనే వ్యక్తి చెత్త ఏరుకుంటూ జీవిస్తుండేవాడు. ఈనెల 20వ తేదీన భార్యతో కలిసి చెత్త ఏరుకుంటూ ఓ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు. అయితే ముఖేష్‌ని దొంగ అని భావించిన ఫ్యాక్టరీ ఉద్యోగులు.. తాడుతో చెట్టుకి కట్టేసి ఇనుప రాడ్లు, కర్రలతో అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు ముఖేష్ చనిపోయాడు. 
 
ఆ తర్వాత తన భర్తను వెతుక్కుంటూ అక్కడకు వెళ్లిన భార్యపై కూడా వారు దాడి చేశారు. ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
 
దీనిపై గుజరాత్ వడ్గమ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ స్పందిస్తూ, దళితులకు గుజరాత్ రాష్ట్రం సురక్షితం కాదని ఈ ఘటన వీడియోను పోస్ట్ చేశారు. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో జరిగిన దాడికంటే ఇది అత్యంత దారుణమైన ఘటనగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇలాంటి ఘటనలు దేనికి సంకేతమంటూ బీజేపీ పాలకులను ప్రశ్నించారు.

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments